Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణానికి చెందిన మేళ్లచెరువు ముక్కంటి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకూ వీవీ గిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ న్యూఢిల్లీలో జరిగిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఇందుకు గాను ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ను సోమవారం ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగన్నగౌడ్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్లు స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా యరగాని నాగన్నగౌడ్ మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. అసంఘటిత రంగ, బీడీ కార్మికులు, పేదల సమస్యలపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. శిక్షణకు హాజరైన వారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ గురవయ్య, జి.కరుణాకర్రెడ్డి, సయ్యద్ ముస్తఫా, ఎస్కె.హుస్సేన్, కస్తాల రవి, సలీకంటి జానయ్య, తోట లక్ష్మయ్య, బ్రహ్మం, సోమగాని నర్సింహా, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.