Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండమల్లేపల్లి :ఆరు వందల గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన మంగళవారం పట్టణంలో చోటు చేసుకుంది.ఎస్సై భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన ఎస్కె బాబా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతనివద్ద 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.స్మగ్లర్ నుంచి వివరాలు సేకరించగా మాచర్ల నుంచి గంజాయిని తీసుకువచ్చి హైదరాబాద్లోని దూల్పేట తీసుకెళ్తున్నట్టు వివరించాడు.పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిరిమాండ్కు తరలించారు.