Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్పీ రంగనాధ్
నవతెలంగాణ-నల్లగొండ
దేశరక్షణలో సాయుధ దళాల సైనికుల త్యాగం మరువలేనిదని, సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా వారిని స్మరించు కోవడం దేశ పౌరులందరి బాధ్యత అని ఎస్పీ ఏవీ.రంగనాధ్ అన్నారు.సాయుధదళాల పతాక దినోత్సవ సందర్భంగా మంగళవారం ఆయన విరాళం అందజేసి సాయుధదళాల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయుధదళాల వీరత్వాన్ని, త్యాగాన్ని గర్వంగా గుర్తుచేసుకునే సందర్భమే సాయుధబలగాల జెండా దినోత్సవమన్నారు.సాయుధదళాల కుటుంబాలకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధిని వినియోగిస్తారన్నారు.దేశంలోని పౌరులంతా స్వచ్ఛందంగా వారి త్యాగాలకు గుర్తు చేసుకుంటూ విరాళాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అభివద్ధి శాఖ అధికారి మక్బూల్ అహ్మద్,ఎన్సీసీ అధికారులు పాల్గొన్నారు.