Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మంచిర్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు వెళ్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా జట్టు బాలబాలికల క్రీడాకారులకు మంగళవారం పోచంపల్లికి చెందిన నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు వంగరి కష్ణ, గౌరవాధ్యక్షులు తడాఖా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ సూర్యనారాయణ చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి గుడికంటి రమేష్ గౌడ్ , కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, ఉపాధ్యక్షులు నాగేశ్వర్, కోశాధికారి గంధమల కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడి మురళి, ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు, పాల్గొన్నారు.