Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
భారత కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటో ముద్రించే వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఐకమత్యంతో పోరాడుదామని రాజ్యాంగ అవగాహన వేదిక జిల్లా అధ్యక్షులు అస్గర్ అలీ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాలను (52వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశం భిన్నత్వంలో ఏకత్వంతో ఒకరి మతాన్ని ఒకరు గౌరవించడం సంస్కతీ సంప్రదాయాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి దేశ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య మునిసిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్, బర్రె సుదర్శన్,దర్గాయి దేవేందర్ ,అందె నరేష్ సిలివేరు రమేష్, రావుల రాజు, శేక్ హమీద్ పాషా, మజహర్ (బబ్లూ), బుగ్గ రమేష్, తదితరులు పాల్గొన్నారు.