Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి విశిష్ట పురస్కారాన్ని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన ప్రముఖ కవి, సాహితీవేత్త డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్యకు అందజేశారు. లక్ష రూపాయల నగదును, ప్రశంసా పత్రంను విఠలాచార్య అందుకున్నారు. ఆయనకు ఈ విశిష్ట పురస్కారం రావడంపట్ల మండలానికి చెందిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.