Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్
నవతెలంగాణ-అర్వపల్లి
రైతులు యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయఅధికారి రాములు నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుంచెమర్తి, కస్తాల గ్రామాల్లో నిర్వహించిన ఆరుతడిపంటల సాగుపై అవగాహనాసదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ యాసంగి సీజన్లో ఎఫ్సిఐ ధాన్యం కొనుగోళ్లను చేయదని దీంతోపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండవని కావున రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని అన్నారు .వరి పంటలు వేసుకుని రైతులు నష్టపోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో దినకరన్, ఏఈఓ సత్యం, శోభారాణి పాల్గొన్నారు.