Authorization
Sun April 13, 2025 11:33:34 am
జై గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తండు హరికృష్ణ
నవతెలంగాణ - హుజూర్నగర్
గౌడ కులస్తులంతా ఐకమత్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జై గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు తండు హరికృష్ణగౌడ్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లా డుతూ రాష్ట్రంలో గౌడ కులస్తులకు రాజకీయ పరంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నా రు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించడం లేదన్నారు. ప్రతి గ్రామంలోనూ తాటి, ఈత వనాల పెంపునకు పదెకరాల భూమి కేటాయించాలని కోరారు. కాటమయ్య పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో కృషి చేస్తామని అన్నారు.