Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో గురువారం గౌడ సంఘం నూతన భవనం ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్ఠాపనకోసం కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం లిమిటెడ్ అధ్యక్షులు గనగని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సోమేశ్వర ఆలయం ప్రధానార్చకులు, గౌడ మఠాధిపతి సోమన్న పంతులు, చంద్రశేఖర్ పంతులు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు గణగాని నర్సింహులు, ప్రధాన కార్యదర్శి మొరిగాడి బాలరాజు ,కోఆప్షన్ సభ్యులు మొరిగాడి కాటమయ్య, గణగాని కిష్టయ్య , సీసా సత్తయ్య, డైరెక్టర్లు మొరిగాడి చంద్రశేఖర్, మొరిగాడి విద్యాసాగర్ , సీస మహేశ్వరి ప్రభాకర్, జనగాం మహేష్, ఘనగాని రాము, సీసా స్వాతి ప్రవీణ్ ,మోటకొండూరు వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశం ,నాయకులు మొరిగాడి వెంకటేష్ ,దూడల చంద్రమౌళి, జనగామ శంకరయ్య ,ఘన గని వెంకటేష్, శ్రీనివాస్,సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .