Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ - సూర్యాపేట
ఈ నెల 21, 22 తేదీల్లో హుజుర్ నగర్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో ఉయ్యాల నగేష్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ టూ టౌన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో నికరమైన పోరాటాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డబుల్బెడ్రూంలు ఏమయ్యాయని, దళితులకు మూడెకరాల భూమి పథకం ఎటు పోయిందని ప్రశ్నించారు. సూర్యాపేటలో ఏండ్ల తరబడిగా ఉన్న రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, టూటౌన్ కార్యదర్శి బత్తుల వెంకన్న, టౌన్ కమిటీ సభ్యులు బొల్ల వెంకట్రెడ్డి, మొకర్ల వెంకన్న, కంచుగట్ల శ్రీనివాస్, శ్రీనివాస్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.