Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రం పై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పై కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, నియోజకవర్గ రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు .