Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్నారాయణపురం
మండలంలోని పుట్టపాక గ్రామంలో సోమవారం స్వచ్ఛ సర్వేక్షన్ 2011 కేంద్ర బందం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న పారిశుధ్యం పనులను, మురికి కాలువల నిర్మాణాలను, స్వచ్ఛభారత్ పనులను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న పథకాలను పరిశీలించారు. పాఠశాలల్లో మురుగునీటి పారుదల మరుగుదొడ్లు మూత్రశాలల ఏర్పాటు వంటి అంశాలపై విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మురుగు నీటి పారుదల, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఈ బందం వెంట యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ పలువురు పంచాయతీ కార్యదర్శులుఉన్నారు.