Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
పట్టణకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఫిర్యాదులలో 59 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించినవి కాగా మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.