Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజలు పలు సమస్యలపై ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి సత్వరచర్యలు చేపట్టాలని ఆదనవు కలెక్టర్ ఎస్. మోహన్రావు జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన అర్జీలను స్వీకరించి మాట్ట్లాడారు.ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకేంద్రాలలో కొనుగోళ్ల వేగం పెంచాలని సూచించారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా మిల్లర్లకు సత్వరమే పంపించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో భూసమస్యలకు సంబంధించి దరఖాస్తులు 09, వివిధ శాఖలకు సంబంధించి 10 మొత్తం 19 దరఖాస్తులు అందాయన్నారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ జ్యోతిపద్మ, శంకర్, దయానందరాణి,డీఎస్ఓ విజయలక్ష్మీ,పర్యవేక్షకులు సుదర్శన ్రెడ్డి, పులిసైదులు,వివిధశాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.