Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలకేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.ఎస్ఐ బత్తిని శ్రీకాంత్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బొగ్గు మట్టయ్య తన కూతురు వనజ(25)ను నేరేడుచర్ల మండలం పెంచికల్దిన్నె గ్రామానికి చెందిన కందులచంద్రయ్య,నాగమణి దంపతుల కుమారుడు సురేష్కు ఇచ్చి మూడు నెలల కింద వివాహం చేశాడు.కాగా కొంతకాలంగా భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తుండడంతో సోమవారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటల సమయంలో పెన్పహాడ్లోని తన తల్లిదండ్రుల ఇంటివద్ద వనజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.మతురాలి తండ్రి మట్టయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.