Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
తెెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ రాజ్ ప్రేమ్కుమార్ కోరారు.సోమవారం పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన టూ వీలర్ వాహనాల స్టాండును ఆయన ప్రారంభించి మాట్లాడారు.వివిధ గ్రామాల నుంచి రాత్రి ఉదయం సమ యంలో టూవీలర్ వాహన దారులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి ఎందుకోసం తమ వాహ నాలను బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాహనాల స్టాండ్లో వెహికల్స్ని పెట్టి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులలో వీలుంటుందన్నారు.దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణించొచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సీఐ సైదులు, సిబ్బంది దీపసుధాకర్బాబు,వెంకటయ్యదుండిగల్ పాల్గొన్నారు.