Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అధ్యాపకులు శ్రీశైలం అధ్యక్షతన జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజం గణిత శాస్త్రంలో చేసిన ఎనలేని కషికి గాను ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. ఆయనను స్పూర్తిగా తీసుకొని విద్యార్దులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జయపాల్, రేవతి, విద్యాసాగర్,నరేందర్, మధుబాబు, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.