Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు కోరారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అపరిశుభ్రంగా ఉన్న గ్రామాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యం కాపాడడంలో ముఖ్యమైన తను పెంచాలని అరవై జీవోను అమలు చేయాలని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలి ఎస్కే డే ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జి పి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ఈశ్వర్, నాయకులు ఐలయ్య , శ్రీను , నాయకురాలు పొట్ట యాదమ్మ, రామారావు , మార్కండేయ, భాస్కర్, పద్మారావు , శంకర్, నరసమ్మ, భారతమ్మ , యాదగిరి, కమలమ్మ నీల లు పాల్గొన్నారు.