Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
నవతెలంగాణ -చండూరు
మతుల కుటుంబాలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ వనమాల ప్రభాకర్ గుండె పొటుతో మృతిచెందాడు. గురువారం ఆయన మృతదేహాన్ని ప్రభాకర్రెడ్డి సందర్శించి పూలమాలలు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. అదే విదంగా బొడంగిపర్తి గ్రామానికి చెందిన టీిఆర్ఎస్ కార్యకర్త బొమ్మరబోయిన రాజు , అతని భార్య మరణించడంతో అనాథలైన వారి పిల్లలకు రూ.75,000 ఆర్థిక సహాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొమ్మల శ్రీను మరణించడంతో రూ.10,000 అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎరుకల భిక్షంకు రూ.6,000 అందజేశారు.