Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -మునుగోడు
ప్రజలంతా కులమతాలకతీతంగా జీవించాలని ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో బి .యాకూబ్ నాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కమ్మగూడెం చర్చిలో ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకలను 165 మందికి పంపిణీచేశారు. అనంతరిం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిర్యాల వెంకన్న , ఎంపీటీసీ సభ్యులు ఈద నిర్మల శరత్ బాబు , మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి.రఫిక్ , వివిధ గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.