Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్
నవతెలంగాణ - సూర్యాపేట
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పాలనలో పండుగలన్నీ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని టీఆర్ఎస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ అన్నారు. మండల పరిధిలోని కెటి అన్నారంలో నూతనంగా నిర్మించిన శ్రీ కంఠ మహేశ్వరస్వామి దేవాలయంలో ఆయన శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన పలువురు ప్రజా ప్రతినిధులు, కుల పెద్దలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొన్నేండ్లుగా సూర్యాపేటతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల నిధులతో ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు శెనగాని రాంబాబుగౌడ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గురుమూర్తి, నక్కల జానీ, అరుణ్, శ్రీనివాస్, పందిరి మల్లయ్య, మధు, దశరథ, శ్రీను, సైదులు, కప్పుల మోహన్, పోతరాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.