Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
బస్సు - ఆటో ఢకొీని ఒకరికి గాయాలైన సంఘటన శనివారం యాదాద్రి ఆలయ ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..క్రిస్మస్ సెలవు దినం కావడంతో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డుపై రాకపోకలను నిలిపేశారు. రెండవ ఘాట్ రోడ్డు మార్గం ద్వారా పాదాచారులు, వాహనాల రాకపోకలతో సాగుతుండటంతో ఆ మార్గంలో ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో బస్సు - ఆటో ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గోర్ల రమేష్కు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య సందర్శించారు.