Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని మండల వైద్యాధికారి శ్రవణ్ అన్నారు .మండల కేంద్రంలో మంగళవారం నగర పురపాలక ఆరో వార్డు బహదూర్ పేటలో పీహెచ్సీ మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ అధ్యర్యంలో స్థానిక వార్డు కార్యాలయం వద్ద వ్యాక్సిన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ. కరోనా మహమ్మారిని తరిమి వేయాలంటే ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వరాజ్యలక్ష్మి, ఆశా వర్కర్ జంపాల మంజుల, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.