Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పార్కును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ- నల్లగొండ
పట్టణంలోని నీలగిరి నందనవనం అర్బన్ పార్క్ను సందర్శకులను ఆహ్లాద పరిచే విధంగా అభివద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నీలగిరి నందన వనం అర్బన్ పార్క్ను సందర్శించి పార్క్లో కలియ తిరిగారు. పార్క్లో జరుగుతున్న అభివద్ధి పనులను డీఎఫ్ఓ రాం బాబు కలెక్టరకు వివరించారు. పార్క్లో పగోడా నిర్మాణం సివిల్ పనులు పూర్తి చేసినట్లు,తుది మెరుగులు దిద్దే పనులు చేయాల్సి ఉందన్నారు. ప్లాంటేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు.పార్క్లో సైక్లింగ్కు 5 సైకిళ్ళు, బ్యాటరీ ఆటో ,పిల్లల ఆడు కునేలా పరికరాలు, జంతువుల ప్రతిమలు, సైన్ బోర్డ్లు ఏర్పాటు పనులు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.అనంతరం ఆర్టీఓ కార్యాలయం,పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ కి కేటాయించిన స్థలమును సందర్శించి ఎంత విస్తీర్ణం లో ఉంది అధికారులను అడిగి తెలుసుకున్నారు.హెలిపాడ్కు స్థల సేకరణలో భాగంగా పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్ఓ రాంబాబు, ఆర్డీఓ జగదీశ్వర్ఱెడ్డి, తహసీల్దార్ నాగార్జున ఉన్నారు.
శిల్పారామం పార్కు పరిశీలన
నేడు జిల్లాకేంద్రంలో రాష్ట్ర పురపాలన, పట్టణాభివద్ధి, ఐటిశాఖ మంత్రికేటీఆర్ అర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి పర్యటించనున్నందున గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి పట్టణం లో పర్యటించారు.పానగల్ వద్ద మహాత్మా గాంధీ పీజీ కాలేజి వద్ద శిల్పారామం పార్క్ ఏర్పాటు పరిశీలన చేశారు. అనంతరం వల్లభ రావు చెరువు సుందరీకరణ పై చర్చించారు.తర్వాత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మెన్ మందడి సైది రెడ్డి ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీఎఫ్ఓ రాంబాబు, తహసీల్దార్ నాగార్జున ఉన్నారు.