Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పురపాలన, పట్టణాభివృద్ధి ,ఐటీశాఖ మంత్రి
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
వచ్చే జూన్2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు కనపడాలని రాష్ట్ర పురపాలన, పట్టణాభివద్ధి, ఐటి, శాఖ మంత్రి కె. తారకరామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిఎం కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి జిల్లాలోని మున్సిపాలిటీలలో, నల్లగొండ పట్టణంలో చేపట్టాల్సిన పనులపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. నల్లగొండ పట్టణంలో చేపట్టిన పాదయాత్రలో ప్రజలు, షాప్ యజమానులు ఇంకా ఏమి కోరుకుంటున్నారనే విషయాలు అడిగినట్టు తెలిపారు. మంచినీరు రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా వస్తున్నాయని, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం జరగడం లేదని, ఇన్వెస్టర్ల అవసరం కూడా లేనందున తీసివేసినట్టు తెలిపారని చెప్పారు. ఇంకా ఏమి మార్పు కావాలని అడిగితే, రోడ్ల పరిస్థితి బాగా లేదని, ఉపాధి అవకాశాలు తీసుకురావాలని, పరిశ్రమలు పెంచాలని సూచించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ కు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ల కోసం నల్లగొండ పట్టణంలో రెండు స్థలాలు వెతకాలని, అలాగే రైతు బజారు ఏర్పాటు కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని, అర్బన్ లంగ్ స్పేస్ కోసం రెండు చోట్ల స్థలాలు ఎంపిక చేయాలని తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో నల్గొండ పట్టణ ప్రజలకు మీరు చేసిన అభివద్ధి కార్యక్రమాలతో స్పష్టంగా వారికి మార్పు కనపడాలన్నారు. , మొదటగా ఆరు ముఖ్యమైన జంక్షన్ లను ఫుట్ పాత్ లు, సర్వీస్ రోడ్లతో ఏర్పాటు చేయాలని, పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాల స్థానంలో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయ సముద్రం సుందరీకరణ, అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. టీయూఎఫ్ఐడీసీి ద్వారా నల్లగొండకు 100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఇందులో 30 కోట్లు వివిధ పనులకు శాంక్షన్ చేశామని, మిగతా 70 కోట్లతో పనులకు టెక్నికల్ శాంక్షన్స్ పొందాలని సూచించారు. నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నెలకు ఒకసారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి పనులు పరిశీలిస్తామని తెలిపారు. నల్లగొండ చుట్టూ 50 ఎకరాలలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి టౌన్షిప్ ఏర్పాటు చేయాలని, తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని అధికారులను ఆదేశించారు. నల్లగొండ మున్సిపాలిటీ ఒక రోల్ మోడల్ గా నిలవాలని, జిల్లాలోని మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉండాలనేది సీఎం గారి కోరిక అని అన్నారు. మిగతా మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కింద 72 కోట్ల 72 లక్షల కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో టౌన్హాల్ భూములకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్బీ సూపరింటెండింగ్ ఇంజనీర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, రవీందర్రావు, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర పురపాలన, పట్టణాభివద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రమా రాజేశ్వరి, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్ లు, రెవెన్యూ, ట్రాన్స్కో , ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.