Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ ట్రాఫిక్ పోలీసులు కూలీలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ చీర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని డీఈఓ కార్యాలయం వద్ద నిత్యం కూలి పనులకు వెళ్లే వారికి ప్రభుత్వ మార్గదర్శకాలు, మాస్క్ ధరించాల్సిన ఆవశ్యకత, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా వారి ఆరోగ్యాలతో పాటు కుటుంబాలను రక్షించుకునేందుకు తీసు కోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. మాస్క్ ధరించకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం లక్ష్యంగా దేవరకొండ రోడ్డులో పలు ప్రాంతాలలో తెరిచి ఉంచిన రోడ్డు క్రాసింగులను, డివైడర్ల మధ్య తెరిచి ఉన్న వాటిని మూసివేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సిబ్బంది మహేందర్, వెంకటేశ్వర్లు, మీరా, స్వామి పాల్గొన్నారు.