Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ థర్డ్వేవ్తో అప్రమత్తంగా ఉండాలి
అ జిల్లాలో 96 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
అ మంత్రి జగదీష్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
15 నుండి 17 ఏండ్ల యువతీ యువకులు విధిగా వ్యాక్సినేషన్ చేపించుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు.తండా నుండి బస్తి వరకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు.సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 15 నుండి 17 ఏండ్ల యువతీ, యువకులకు ఇచ్చే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.ప్రపంచవ్యాప్తంగా మూడవ వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో యావత్ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే సమయంలో కరోనా అంటే బయపడొద్దని,స్వీయనియంత్రణతో పాటు వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న నిబంధనలు పాటించగలిగితే తప్పించుకోగలుగుతామన్నారు.పెద్దలకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జిల్లాలో మొదటి డోస్ 96 శాతం పూర్తి కాగా రెండో డోస్ ఇప్పటి వరకు 50 శాతానికి పైబడి తీసుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినరుకష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మెన్ ఉప్పల లలితా ఆనంద్,అదనపుకలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్,డీఎంహెచ్ఓ వెంకటరమణ, డాక్టర్ మురళీధర్రెడ్డి పాల్గొన్నారు.