Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫిర్యాదుల సింహభాగం రెవెన్యూ అంశాలు
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా తన ఛాంబర్లో ప్రజల నుండి 71 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ప్రజల ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల్లో 57 ఫిర్యాదులు రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించినవి కాగా, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ప్రతి సోమవారమూ నిర్వహించే ప్రజావాణికి ప్రజల నుంచి ఎక్కువగా రెవెన్యూ సంబంధితమైన అంశాలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. రెవిన్యూ భూ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా రావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ కుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.