Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిర్యాలగూడ నియోజకవర్గ అభివద్ధికి రాజకీయాలకతీతంగా కషిచేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 34, 42 వార్డులలో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో వారుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ, వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇందుకు నిధులు కేటాయిస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వార్డు కౌన్సిలర్లు ఉబ్బపల్లి సోమమ్మ, సోమయ్య, సత్యవతి శ్రీనివాస్ మధు, మగ్దూం పాషా, ఖాదర్ పాల్గొన్నారు.