Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రైతు సంక్షేమంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి ఆర్థిక భారం కాకూడదని ప్రతి ఏడాది ఎకరానికి రూ.10 వేలచొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలాజీనాయక్, పాఠశాల హెచ్ఎం లక్ష్మి, రాజు, నాయకులు మధు, ఉదయభాస్కర్, సలీం, సైది రెడ్డి పాల్గొన్నారు.