Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
మద్యం సేవించడంతోనే మహిళలపై దాడులు అధికమవుతున్నాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో గురువారం ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గల్లీకో మద్యం షాపు ఏర్పాటు చేయడంతో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. మహిళలు ఐక్యంగా ఉద్యమించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు దైదా జానకమ్మ మాట్లాడారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలుగా ప్రమీలా, ఉపాధ్యక్షురాలుగా సుకన్య, మండల కార్యదర్శిగా విజయ, సహాయ కార్యదర్శిగా కైక, కమిటీ సభ్యులుగా దేవి, సరోజిని, సాలి, కమల, జయ, లక్ష్మి పాల్గొన్నారు.