Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెన్పహాడ్:మండలపరిధిలోని తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన గునుగుంట్ల గోపయ్య గీత కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. కాగా అతనికి నరాల వ్యాధి వచ్చి వైద్యానికి ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్నాడు. విషయాన్ని మంత్రి జగదీశ్రెడ్డి దష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆయన గోపయ్య వైద్యానికి ఎల్ఓసీ ద్వారా లక్ష రూపాయలు మంజూరు చేయించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.ఈ సందర్భంగా గోపయ్య కుటుంబసభ్యులు, గ్రామస్తులు మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.