Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ప్రేరెపిత ప్రజననం ద్వారా అవసరమైన చేపపిల్లల ఉత్పత్తితో చేపలపెంపకం అధికోత్పత్తిని సాధించగలుగుతున్నామని కేవీకే గడ్డిపల్లి ఇన్చార్జి సీనియర్ శాస్త్రవేత్త,అధిపతి బి.లవకుమార్ అన్నారు.గురువారం కేవీకే గడ్డిపల్లి లో షెడ్యూల్డ్ కులాలకు ఔత్సాహిక యువతకు జాతీయ మత్య్స అభివద్ధి మండలి, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం వారి ఆర్థిక సహకారంతో,సెంటర్ ఫర్ ఇన్న్వ్ఱోషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్ వారి సహకారం తో నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణలో భాగంగా చేప పిల్లల ఉత్పత్తి హాచేరీ యాజమాన్యం పై పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త బి.రవీందర్ అవగాహన కల్పించారు.అనంతరం లవకుమార్ మాట్లాడుతూ కార్ప్ చేపల బ్రీడింగ్ కోసం బ్రూడర్ చేపలను ఎంపిక చేసుకొని వాటిని ప్రత్యేకంగా పెంచుకోవడం ద్వారా కార్ప్ చేపల అండోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.ఆడ, మగ చేపలు 1:1 సంఖ్య 1:2 నిష్పత్తి లో ఉండాలని, రెండేండ్ల వయస్సున్న, పరిపక్వత చెందిన చేపలను బ్రీడింగ్కు ఎంపిక చేసుకోవాలన్నారు.సింథటిక్ హార్మోన్స్ అయిన ఓవప్రీమ్, ఓవటైడ్లను తగు మోతాదులో ఇంజక్షన్ ఇచ్చి చేపపిల్లల ఉత్పత్తిని పొందొచ్చన్నారు.బ్రీడింగ్ ట్యాంక్లో నుండి గుడ్లను సేకరించుకొని హాచింగా పూల్లోకి వదిలి స్పాన్ను పొందవచ్చన్నారు.తదుపరి స్పాన్ను నర్సరీ చెరువుల్లోకి వదిలి ఫ్రై,ఫింగర్ లింగ్ దశ వరకు పెంచుకోవచ్చునని తెలిపారు.కార్ప్ హాచేరీ చిన్నపాటి రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యువతకు కార్ప్ హాచేరీ విభాగాన్ని సందర్శించి ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు.తదుపరి చేపల చెరువుల్లో ఉపయోగించే ప్రోబ యోటిక్స్పై ఆక్వా ఎగ్జిక్యూటివ్ బి. శ్రీకాంత్ అవ గాహన కలిపించారు.ఈ కార్యక్రమంలో సుప్రీత,లక్ష్మీ, రాంబాయి, పుష్ప, స్రవంతి, శైలజ, భవాని, శ్రీను, ప్రదీప్, రాంబాబు, నాగరాజు, మట్టయ్య, విశ్వనాధం పాల్గొన్నారు.