Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
సాగర్ నీటివిడుదలను ఈ నెలాఖరు వరకు సాగర్ ఎడమకాలువకు నీటి విడుదలను కొనసాగించాలని సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు కోరారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వారబంధి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7న కాలువకు నీటిని నిలుపుదల చేస్తే రైతులు ఇబ్బందులు పడ్తారన్నారు.ప్రస్తుతం సాగర్ ఎడమకాలువ కింద రైతులు ముమ్మరంగా వరి నాట్లు వేస్తున్నారని గుర్తు చేశారు.ఈ క్రమంలో నీటి విడుదల షెడ్యూల్ను అమలుచేస్తే రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని ఎన్నెస్పీ అధికారులు ఈనెల 31 వరకు కాలువకు నీటిని విడుదల చేయాలని కోరారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.