Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
మండలంలోని తొండ గ్రామంలో గురువారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లాంల బాలనర్సయ్య దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పూల మాలలేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు గుడిపాటి నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్సోజ్ నరేష్, సర్పంచ్ నెమురుగుమ్ముల శాతవాహనరావు, ఎంపీటీసీ జుమ్మీలాల్, మాజీ ఎంపీటీసీ రామాంజి, గ్రామ అధ్యక్షుడు రామారావు, చంద్రమౌళి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు దయాయాదవ్ పాల్గొన్నారు.