Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పల్లె పర్యవేక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని మన్నేవారిపంపు, వడపర్తి గ్రామాల సర్పంచులు,గ్రామ ప్రజలు, అధికారులతో కలిసి ప్రతివాడలోనూ ఎమ్మెల్యే పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండిఎ నిధుల నుండి 10 రోజుల లోపు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ నల్లమాస రమేష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, వడపర్తి సర్పంచ్ ఎలిమినేటి కష్ణారెడ్డి, మన్నె వారి పంపు సర్పంచ్ బోయిని పాండు, భువనగిరి సింగిల్విండో చైర్మెన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, రెతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, నీల ఓంప్రకాశ్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు భల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కేశపట్నం రమేష్, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.