Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ మాజీ చైర్మన్ బత్తుల అనంత రెడ్డి మాతృమూర్తి నరసమ్మ శనివారం మతి చెందారు. ఆమె మృతదేహానికి సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కల్లూరి యాదగిరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చెరుకు పెద్దులు, మాజీ మండల కార్యదర్శి గాలి నరసింహ, నాయకులు చింతపల్లి బయన్న, కుమ్మరి శంకర్, దండు నాగరాజు, బోలెద్దు సైదులు పాల్గొన్నారు.