Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
బీజేపీ, టీఆర్ఎస్లు ఒకతాన గుడ్డలేనని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి ఎస్కె.యాకుబ్ విమర్శించారు.ఆదివారం మండలపరిధిలోని కీతవారిగూడెం గ్రామంలోని సుందరి బిక్షమయ్య భవనంలోని జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా మతవిధ్వేషాలను రెచ్చగొడుతుందన్నారు.కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తుందన్నారు. ఒకేసారి రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడంవల్ల పంటలు సరిగా పడక పోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతుబంధు పేరుతో వార్షికోత్సవాలు నిర్వహిస్తుండడం ఏంటని ప్రశ్నించారు.ఈ సమావేశంలో సీనియర్నాయకులు తుమ్మలసైదయ్య,జుట్టు వెంకటేశ్వర్లు,బి.శ్రీనివాస్,బి.వెంకయ్య,రమేష్, జంగయ్య, నారాయణ, మట్టయ్య పాల్గొన్నారు.