Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
నిరంతరం ప్రజా సమస్యలపై ప్రచురితమయ్యే వార్తలను ప్రచురించే దినపత్రిక నవతెలంగాణ దినపత్రిక అని కుర్మేడ్ సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్ర ప్రసాద్,ఎస్ఐ వెంకటేశ్వర్లు. అన్నారు. సోమవారం చింతపల్లి మండలంలోని కుర్మేడ్ గేటు వద్ద నవతెలంగాణ క్యాలెండర్ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. పత్రికలో ఉన్నది ఉన్నట్టుగా నికచ్ఛితంగా వార్తలు రాసే ఏకైక పత్రిక నవ తెలంగాణ దినపత్రిక అని అన్నారు.ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై ప్రజల సమస్యలు వెలికితీసే దినపత్రిక అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మర్రిగూడెం ఎస్సై నాగుల్మీరా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాటకొండ నాగేంద్రప్రసాద్, మాజీ సర్పంచ్ కుర్మెటి బజారు, వెంకటేశ్వరరావు, పటేల్బాల్జంగయ్య గౌడ్, జెల్లా నర్సింహాగౌడ్, వాటర్ మ్యాన్ యాదగిరి పాల్గొన్నారు.