Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ మోహన్రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ప్రజలు పలు సమస్యలపై అందచేసిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఎక్కువగా భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు.ప్రజావాణిలో వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కారదిశగా సత్వరమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాసమస్యలపై ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరుకావాలని అలాగే కరోనా నేపథ్యంలో అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు 28, వివిధ శాఖలకు సంబంధించి 16 మొత్తం 44 దరఖాస్తులు అందాయన్నారు.ఈ కార్యక్రమంలో పీడీ జ్యోతిపద్మ, శంకర్, దయానందరాణి, డీఎం రాంపతి, డీఎస్ఓ విజయలక్ష్మీ, పర్యవేక్షకులు సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.