Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ ,మెంబర్షిప్ ,సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుకుగా జరిగేలా చూడాలని ఆలేరు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పి. ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఇందిరా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చురుకుగా జరిగేలా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగామ ఉపేందర్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరంఆ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్ ,నాయకులు నీలం పద్మ వెంకటస్వామి,కనురాజు వేంకటేశ్వరరాజు, ఎమ్ ఎ ఎజాజ్ , అనిత దశరథ ,వెంకటేష్, బాలరాజు, రమేష్ , ఎగిడి యాదగిరి , నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.