Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీయడంలో నవతెలంగాణ పత్రిక ముందుంటుందని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య అన్నారు. నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం పట్టణకేంద్రంలో తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు చేస్తున్న అవినీతి తిని ఎండగట్టడంలో పత్రిక తీరు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఆర్.యాదగిరి గౌడ్, కౌన్సిలర్లు ముఖ్యర్ల మల్లేష్ యాదవ్, గౌలికార్ అరుణ రాజేష్,నవ తెలంగాణ డివిజన్ ఇన్చార్జి షేక్ ఉస్మాన్ షరీఫ్ ,రిపోర్టర్లు బుడిద శ్రీహరి, పేరబోయిన నర్సింహులు, కాంగ్రెస్ నాయకులు గుండు నరసింహ గౌడ్, గుండ్లపల్లి ముత్యాలు గౌడ్ ,బొజ్జ సాంబేష్ ,గుండు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.