Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేయడం తగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న గ్రంథాలయం, విద్యుత్ కార్యాలయం, పశువైద్యశాల, పంచాయతీరాజ్ కార్యా లయం భవనాలను పరిశీలించారు. స్వార్థం కోసం కొత్త భవనాలను కూల్చివేసి సమీకృత మార్కెట్ ఏర్పాటు ప్రయత్నం చేస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ఏర్పాటుకు పట్టణంలో అనువైన స్థలాలు చాలా ఉన్నాయని, వాటిని పరిశీలించి ఆ ప్రాంతంలో మార్కెట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి వంటెపాక వెంకటేశ్వర్లు, నాయకులు మరి వెంకటయ్య, కొప్పుల అంజయ్య పాల్గొన్నారు.