Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలో రహదారుల అభివృద్ధి, జంక్షన్ల ఏర్పాటు, మీడియన్లు, ఫుట్ పాత్లు,సైడ్ డ్రైన్స్, పట్టణ సుందరీకరణ పనులపై మున్సిపల్, ఆర్అంబీ, రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులు ప్రణాళికాబద్దంగా సమన్వయంతో పనులు చేపట్టాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.బుధవారం నల్గొండ పట్టణంలో రహదారుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ పనులపై స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ఆయా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లను జంక్షన్లుగా ఏర్పాటు చేసి ఆధునీకరించాలన్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీ ద్వారా నామ్ రోడ్డు (మర్రి గూడ బై పాస్), వివేకానంద విగ్రహం, ఎన్జీ కాలేజీ, బస్ స్టాండ,్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, కలెక్టరేట్, మునుగోడ్ రోడ్డు జంక్షన ్(ఈద్గా ఎదురుగా), నేషనల్ హైవే ద్వారా క్లాక్ టవర్ వద్ద, సావర్కర్ నగర్, పాత కలెక్టరేట్ జంక్షన్( ఆర్పీ రోడ్ ), వన్ టౌన్ పోలీసు స్టేషన్, డీఈఓ ఆఫీసు, జైల్ ఖానా, గంధవారి గూడెం, వైఎస్ఆర్ విగ్రహం (సాగర్ రోడ్ )వద్ద చేపట్టాలని నిర్ణయించారు. డిజైన్ లను మున్సిపాలిటీ నేషనల్ హైవే శాఖకు అందచేయనున్నట్లు తెలిపారు. రాబోయే 40 సంవత్సరాలకు ఉపయెగపడే విధంగా రోడ్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు. నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో మెత్తం 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన జంక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా జంక్షన్లను ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. పట్టణ పరిధిలో నకిరేకల్ టు సాగర్ ఎన్ హెచ్ 565 రహదారి, పట్టణం నుంచి 10 కిలోమీటర్ల వరకు పానగల్ నుంచి ఎస్ఎల్బీసీ రహదారి ఫోర్ లేన్ చేయాలని, ప్రస్తుతం 10 కి.మీ.లలో 3 కి.మీ ఫోర్ లేన్ తో పాటు మిగిలిన 7 కి మీ.రహదారిని పోర్ లేన్ రహదారిగా రూపొందించుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని నేషనల్ హైవే అధికారులను కోరారు. అంతే గాక రైతు బజార్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాల్సి ఉంధని అధికారులు ఈ విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు పై సంబంధిత అదికారులతో మాట్లాడాలని కలెక్టర్ని కోరారు. తొలుత మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఇటీవల నల్గొండ పర్యటనలో రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించిన విధంగా ఎన్యూడీఏ (నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి) ఏర్పాటుతో నల్గొండతో పాటు చుట్టుపక్క ల ఉన్న ప్రాంతాలను కూడా డెవలప్ చేయవచ్చన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుందని అన్నారు. నల్గొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా భూముల రేట్లు పెరగడంతో పాటు, వాణిజ్య ప్రాంతాలు ఏర్పాటు అవుతాయని, ప్రభుత్వానికి లే అవుట్స్ రాబడి పన్నుల రూపంలో వస్తుందని, ఇందుకు ప్రతిపాదనలు రూపొందించినట్లు, ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపనున్నట్లు వివరించారు. సమావేశంలో రోడ్ల అభివృద్ధిపై రూపొందించిన మ్యాపులను పరిశీలించారు. తొలుత కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన, బస్తీ దవాఖాన, రైతు బజార్కు, ఎల్లమ్మ గుడి పక్కన మినీ వెజ్, ఫిష్, నాన్ వెజ్ మార్కెట్ కు జిల్లా కలెక్టర్, శానసభ్యులు స్థల పరిశీలన చేసి అధికారులతో చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, వైస్ చైర్మెన్ అబ్బగొని రమేష్, నేషనల్ హైవేస్ కల్వకుర్తి ఈఈ రాజేందర్, సూర్యా పేట డిప్యూటీ ఈఈ ప్రతాప్ రెడ్డి, నల్గొండ ఏఈ ఈ. మురళి, మున్సిపల్ డీఈ. అశోక్ తదితరులు పాల్గొన్నారు.