Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీవీ నారాయణరావు మృతి తెలుగువారికి తీరని లోటు అని నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి అన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత టీవీ నారాయణరావు మంగళవారం తుది శ్వాస విడిచిన సందర్భంగా బుధవారం తార్నాకలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, ప్రజాసేవకుడు, కవి, రచయిత, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారన్నారని చెప్పారు. నారాయణరావు ఆయన సతీమణి టీఎన్ సదాలక్ష్మి పేదల అభ్యున్నతికి ఎంతో కషి చేశారన్నారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సంటి కుమార్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.