Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రోగుల బెడ్ సౌకర్యం, పరిసరాల శుభ్రతను పరిశీలించారు. కరోనా మళ్లీ విజంభిస్తుండటంతో పలు సూచనలిచ్చారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. రోగుల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కోవిడ్ టెస్టులు,చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రాంతి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.