Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు దాసరిపాండు
బొమ్మలరామారం: సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దాసరి పాండు కోరారు. బుధవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి రేకల శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ,నిత్యావసర వస్తువులు, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు నెల్లూరు కుమార్, బ్రహ్మచారి, ఏలూరు కిష్టయ్య, లక్ష్మయ్య, కిష్టయ్య ,రమేశ్, ముక్కల, పున్నమ్మ,తదితరులు పాల్గొన్నారు.