Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
గ్రామంలోని ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని మునుగోడు గ్రామ కార్యదర్శి ఎస్.మురళి మోహన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో రోజు అక్రమ కట్టడాలను కూలీలతో కూల్చి వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన రోడ్లను మురుగు కాల్వలను ఆక్రమించుకోవడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. మురుగు కాల్వలను కబ్జా చేయడంతో నీరు నిలిచిపోయి రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్రజల సౌకర్యాలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.