Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లాసంక్షేమాధికాణి కెవి. కృష్ణవేణి
అ ఘనంగా జాతీయ బాలల దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలో బాలిక విధ్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కె. వి. కష్ణవేణి కోరారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని మహిళా , శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల ఆర్ధిక స్వావలంబన కోసం సుఖన్య సమద్ది యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క బాలికకు పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరిచి లబ్ది చేకూరే విధంగా చూడాలన్నారు. జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ బండారు జయశ్రీ మాట్లాడుతూ '' బేటీ బచావో -బేటీ పడావో పథకం ద్వారా బాలిక రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు మాట్లాడుతూ జిల్లాలో బాలికల సంరక్షణకు సంబందించి ముఖ్యంగా ఆడపిల్లల పై ఎలాంటి హింసకు పాల్పడకుండా , వారి హుందాతనాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్జిల్లా అధికారి భూమయ్య మాట్లాడుతూ సుఖన్య సమద్ధి యోజన పథకం ద్వారా బాలికల అభ్యున్నతికి తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ 10 సం. ల లోపు బాలికలను ఈ పథకంలో చేర్పించాలని కోరారు. రష్యాలోని ఎల్బ్రోస్స్ పర్వతాన్ని అధిరోహించిన మొట్ట మొదటి మహిళ కుమారి అన్విత రెడ్డిని సన్మానించడం సన్మానించారు. బాలిక హక్కుల పరిరక్షణ కోసం సామాజిక సమస్యలపై అవగాహనా వాల్పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మెన్ బండారు జయశ్రీ, సఖి సెంటర్ నిర్వహకురాలు డా. ప్రమీల, జ్ఞానేశ్వర్, ఇండియన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్, భువనగిరి, సఖి సెంటర్ అడ్మిన్ సిహెచ్ .లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సఖి సెంటర్ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.