Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మున్సిపల్ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మున్సిపల్ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్లో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మార్నింగ్ షో ప్రారంభమైంది. అయితే విరామ సమయంలో పలువురు ప్రేక్షకులు సిగరెట్ తాగి దానిని ఆర్పకుండా పక్కన పడేశారు. థియేటర్ యాజమాన్యం గతంలో పాత కుర్చీలు అన్నింటిని థియేటర్లో పక్కన పడేశారు.అయితే ఇది గమనించని ఓ ప్రేక్షకుడు సిగరెట్ ఆర్పకుండా అందులో పడవేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంతో ఎలాంటి ఆస్తినష్టం తో పాటు ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సహకారంతో థియేటర్ సిబ్ంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.